రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న పార్టీ టీఆర్ఎస్ మేయర్ జక్క వెంకట్ రెడ్డి

Published: Wednesday April 28, 2021
మేడిపల్లి, ఏప్రిల్27 (ప్రజాపాలన ప్రతినిధి) : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఏకైక పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని పీర్జాదిగూడ నగరపాలక సంస్థ మేయర్ జక్క వెంకట్ రెడ్డి పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ 20వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మేడిపల్లి పార్టీ కార్యాలయం ఆవరణలో కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలతో కలిసి మేయర్ జక్క వెంకట్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఎన్నో ఒడిదుడుకుల మధ్య సాధించి, తెలంగాణను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్తున్న పార్టీ టీఆర్ఎస్ పార్టీ అని కొనియాడారు. సీఎం కేసీఆర్ మరియు కేటీఆర్  నాయకత్వంలో పార్టీ శ్రేణులు, నాయకులు కార్యకర్తలు మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్లాలని మేయర్ వెంకట్ రెడ్డి ఆకాంక్షించారు. జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, దొంతిరి హరిశంకర్ రెడ్డి, ఎంపల్ల అనంత్ రెడ్డి, సుభాష్ నాయక్, మద్ది యుగేందర్ రెడ్డి, నాయకులు బొడిగే కృష్ణా గౌడ్, బండారు రవీందర్, బైటింటి ఈశ్వర్ రెడ్డి, ఏనుగు మనోరంజన్ రెడ్డి, ప్రభు, కర్రె బలరాం, జయేందుర్, నిర్మల, మల్లం వెంకటేష్, ప్రశాంత్, పన్నా భాయ్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.