అభివృద్ధి పనులు వేగవంతంగా పూర్తి చేయాలిసీఎల్పీ లీడర్ మల్లు భట్టి విక్రమార్క

Published: Monday August 01, 2022

మధిర జులై 31 ప్రజాపాలన ప్రతినిధి మధిర పట్టణ కొనసాగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర కాంగ్రెస్ శాసనసభ పక్ష నేత మధిర ఎమ్మెల్యే మల్లు భట్టి విక్రమార్క సూచించారు ఆదివారం  పట్టణంలోని మధిర చెరువు కట్టపై ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ట్యాంక్ బండ అభివృద్ధి పనులను పరిశీలించారు అనంతరం మరో ఐదు కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న సమీకృత మార్కెట్ పనులను ఆయన పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలను పాటించాలన్నారు. ట్యాంక్ బండపై ఆరు అంగణాలతో రహదారి నిర్మిస్తే ఏదైనా వాహనం వస్తే పగిలిపోతుంది కదా! ట్యాంకుబండ పనులను పర్యవేక్షణ చేస్తున్న సిబ్బందిని ప్రశ్నించారు దీనికి సిబ్బంది ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్మిస్తున్నట్లు వారు వెల్లడించారు. ప్రజలకు ఉపయోగపడే అభివృద్ధి పనులను దీర్ఘకాలంగా నాణ్యత ఉండేవిధంగా నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. అనంతరం పట్టణంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదురుగా విఆర్ఏలు చేపట్టిన రిలే నిరాహార దీక్ష శిబిరాన్ని సందర్శించి సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలను అసెంబ్లీలో ప్రశ్నిస్తానని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు సూరంశెట్టి కిషోర్ మండల కాంగ్రెస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు ధారా బాలరాజు బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు చావా వేణు పారుపల్లి విజయ్ కర్నాటి రామారావు దుంపా వెంకటేశ్వర రెడ్డి యూత్ నియోజకవర్గ అధ్యక్షులు తూమాటి నవీన్ రెడ్డి మునుగోటి వెంకటేశ్వర్లు ఆదిమూలం శ్రీనివాసరావు మాగం ప్రసాద్ బోడెపుడి గోపి తదితరులు పాల్గొన్నారు