సెలవు దినాల్లో తరగతులు నిర్వహిస్తే ఆందోళన చేపడతాం

Published: Monday September 26, 2022

మంచిర్యాల టౌన్, సెప్టెంబర్ 25, ప్రజాపాలన: రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 26 నుంచి వచ్చే నెల 9వ తేదీ వరకు విద్యాసంస్థలకు ప్రకటించిన సెలవు దినాల్లో తరగతులు నిర్వహించే ప్రైవేట్ పాఠశాలల ముందు బైఠాయించి ఆందోళన చేపడతామని తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరల వంశీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ సెలవు రోజుల్లో కొన్ని ప్రైవేట్ పాఠశాలల్లో పరీక్షలు, తరగతులు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయని అన్నారు.