గృహ యజమానులకు మెరుగైన పరిహారం చెల్లించాలి

Published: Tuesday April 20, 2021
కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి
మేడిపల్లి, ఏప్రిల్19 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉప్పల్ మెయిన్ రోడ్డు నుంచి కరిగిరి వెంకటేశ్వరస్వామి ఆలయ మార్గంలో చేపడుతున్న రోడ్డు నిర్మాణానికి అడ్డంగా ఉన్న గృహ యజమానులకు మెరుగైన పరిహారం చెల్లించాలని ఉప్పల్ కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి అధికారులకు సూచించారు. ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్ రెడ్డితో కలిసి కార్పొరేటర్ రజితపరమేశ్వర్ రెడ్డి రోడ్డు పనులను పరిశీలించి, రోడ్డు నిర్మాణ పనులను సకాలంలో పూర్తి చేయాలని తెలిపారు. ఈ మార్గంలో కొన్ని గృహాలు రోడ్డుకు అడ్డంగా ఉండటంతో పనికి ఆటంకంగా మారిన విషయాన్ని కార్పొరేటర్ దృష్టికి తెచ్చారు. దీనిపై స్పందించిన కార్పొరేటర్ గృహ యజమానులకు మెరుగైన పరిహారం చెల్లించి సకాలంలో పనులు పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో బాకారం లక్ష్మణ్, జీవన్, బోరంపేట జై కృష్ణ, సుంకు శేఖర్ రెడ్డి, ప్రేమ్, సల్ల ప్రభాకర్ రెడ్డి, ఈదులకంటి రాజి రెడ్డి, జంగీర్, మురళీకృష్ణ రెడ్డి, ఏర బాలు తదితరులు పాల్గొన్నారుు.