నిరుపేద కుటుంబాలకు నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన ఎస్సై.

Published: Friday January 28, 2022
జన్నారం రూరల్, జనవరి 27, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా జన్నారం మండలం రోటిగూడ గ్రామంలో గల్ఫ్ అసోసియేషన్ అదర్యంలో 11 నిరుపేద కుటుంబాలకు స్థానిక ఎస్సై పి.సతీష్ నిత్యవసర సరుకులు బుధవారం పంపిణీ చేశారు. అనంతరం గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి క్యాలెండర్ ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పేదలకు గల్ఫ్ అసోసియేషన్ కమిటీ సహకారం అందించడం అభినందనీయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో రోటిగూడ సర్పంచ్  మల్క విజయ లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
నూతన గల్ఫ్ అసోసియేషన్ కమిటీ ఎన్నిక.
గల్ఫ్ కార్మికుల సంక్షేమ సమితి అధ్వర్యంలో రోటిగూడ గ్రామ నూతన గల్ఫ్ అసోసియేషన్ కమిటీ ఎన్నుకున్నారు. ఈ కార్యావర్గంలో అధ్యక్షుడు పులిశెట్టి నాగేష్, ఉప అధ్యక్షుడు పాలాజి శ్రీనివాస్, వర్కింగ్ ప్రసిడెంట్ ఉప్పు సురేష్, కమిటీ సభ్యులు, నీరటి రాజేందర్, ఉప్పు తిరుపతి, ఉప్పు రవి, జాలపెల్లి కిషన్, ఉప్పు రాజరెడ్డి, జిల్లపెల్లి మహేష్, పులిశెట్టి లవన్, ఉష్కమల్ల సత్తన్న, ఉప్పు మల్లేషం, సాయిని రమేష్, గోనే గోపాల్, తదితరులు పాల్గొన్నారు.