ప్రతి ఒక్కరూ కోవిడ్ టీకాలు వేయించుకోవాలి

Published: Tuesday September 21, 2021
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్ 20, ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మున్సిపాల్టీ 9వార్డ్ ఎం బి ఆర్ నగర్ లో సాయి తేజ కాలేజ్ గ్రౌండ్ లో సోమవారం ఇబ్రహీంపట్నం మున్సిపల్ కమిష్ నర్ జయంత్ కుమార్ రెడ్డి, వార్డు కౌన్సిలర్ నల్లబోలు మమత శ్రీనివాస్ రెడ్డి, భర్ల మంగ జగదీష్ చేతుల మీదుగా కోవిడ్ వ్యాక్సిన్ సెంటర్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా నల్లబోలు మమత మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ వ్యాక్సిన్ వేయించుకోవాలి అని అన్నారు. ఈ కార్యక్రమంలో కొమ్మి డి నరసింహ్మ రెడ్డి, గుండ్ల పల్లి మహావీర్ రెడ్డి, కానుగుల మహేష్. ప్రభుత్వ హాస్పిటల్ మేరీ సిస్టర్, మున్సిపల్ ఆఫీసర్ అశోక్, ఆశ వర్కర్స్ పాల్గొన్నారు.