*ఓబీ కాంట్రాక్ట్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలి*

Published: Thursday March 02, 2023
మంచిర్యాల టౌన్, మార్చి 01, ప్రజాపాలన: ఓబి కాంట్రాక్టు కార్మికుల సమస్యలపై కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ జె ఎ సి ఆధ్వర్యంలో ఆర్ జీ వన్ జి ఎం కార్యాలయం ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. అనంతరం ఆర్ జి వన్ డిజిఎం పర్సనల్ లక్ష్మీ నారాయణకు కార్మికుల సమస్యలపై వినతి పత్రం  అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సింగరేణి యాజమాన్యం ఓబి యాజమాన్యాలను ప్రోత్సహిస్తూ శ్రమ దోపిడీని చేయిస్తున్నదని, హైపర్ కమిటీ వేతనాలు ఇప్పించాల్సిన సింగరేణి యాజమాన్యం ఓబి యాజమాన్యాలకు వత్తాసు పలుకుతూ సింగరేణి యాజమాన్యం అండతోనే ఓబి యాజమాన్యాలు చట్ట ల ఉల్లంఘనలకు పాల్పడుతున్నాయి అని అన్నారు. తక్షణమే సింగరేణి యాజమాన్యం జోక్యం చేసుకొని ఓబి కాంట్రాక్టు కార్మికుల వేతనాలు పెంచే విధంగా  చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంఏ గౌస్, వేల్పుల కుమారస్వామి, పూసాల తిరుపతి, ఏ వెంకన్న, తోకల రమేష్, మద్దెల శ్రీనివాస్, శనగల శ్రీనివాస్ లు ఓబి కాంట్రాక్ట్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు.