సిపిఎం జిల్లా మహాసభలు జయప్రదం చేయండి

Published: Tuesday November 16, 2021
యాదాద్రి నవంబర్ 15 వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి డిసెంబర్ 5, 6, 7, తేదీల్లో పోచంపల్లిలో జరుగు సీపీఎం జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి యండి జహంగీర్ పిలుపునిచ్చారు. సోమవారం అం సీపీఎం మండల కమిటీ సమావేశం జరిగింది. అనంతరం మహాసభల కరపత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై సిపిఎం నిరంతరం పోరాడుతున్నామని, జిల్లాలో ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన అనేక వాగ్దానాలు అమలుకు నోచుకోలేదన్నారు. జిల్లాలో విద్యా, వైద్యం, ఉపాధి, విషయంలో వెంకబాటుకు గురయ్యిందన్నారు. జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రైతాంగానికి సాగునీటిని అందించే విషయంలో జిల్లా ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు వైఫల్యం చెందారని, జిల్లా మహాసభల్లో జిల్లా వ్యాప్త సమస్యలపై భవిష్యత్ కార్యాచరణను రూపొందించి పోరాటాలను నిర్వహిస్తామని అన్నారు. ఈ సమావేశంకు మద్దెల రాజయ్య అధ్యక్షత వహించగా సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మాటూరి బాలరాజు, మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, కార్యదర్శివర్గ సభ్యులు కూర శ్రీనివాస్, మెరుగు వెంకటేశం, కల్కురి రామచందర్, మండల కమిటీ సభ్యులు కొండే కిష్టయ్య, గాజుల ఆంజనేయులు, వాకిటి వెంకట్ రెడ్డి, కల్కురి ముత్యాలు, కర్ణకంటి యాదయ్య, బుగ్గ చంద్రమౌళి, కవిడే సురేష్, దుబ్బ లింగం, బీమనబోయిన జంగయ్య, తదితరులు పాల్గొన్నారు.