సంధ్యాశాలినిని దీవించిన సర్పంచ్ మోహన్ రావు.. తల్లాడ, ఆగస్టు 2 (ప్రజా పాలన న్యూస్):

Published: Wednesday August 03, 2022

తల్లాడ మండలంలోని నరసింహారావుపేట గ్రామానికి చెందిన గోపిశెట్టి నరేష్, నాగమణి దంపతుల కుమార్తె సంధ్యాశాలిని అన్నప్రాసన వేడుక మంగళవారం గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గోపాలపేట గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు ముఖ్యఅతిథిగా హాజరై  చిన్నారికి అక్షింతలు వేసి ఆశీర్వదించారు. నిండు నూరేళ్లు హాయిగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట తెదేపా మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు, సిపిఎం పార్టీ మండల కార్యదర్శి అయినాల రామలింగేశ్వరరావు,  నాయకులు గుంటుపల్లి వెంకటయ్య, పెరసాని వెంకటయ్య, సుంకర వెంకటేశ్వర్లు, శనక్కాయల మోహన్ రావు, శనక్కాయల నరసింహారావు, చల్లా నాగేశ్వరరావు, తమ్మిశెట్టి శ్రీను, సుంకర పెద్ద వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు.