నేడు చౌటుప్పల్ లో జరిగే టిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళన సమావేశం ఏర్పాట్లను పరిశీలిస్తున్న కూసుకుంట

Published: Tuesday September 20, 2022
చౌటుప్పల్, సెప్టెంబర్ 19 (ప్రజాపాలన ప్రతినిధి):  చౌటుప్పల్ పురపాలక పరిధిలోని తాళ్లసింగారం రోడ్డు వద్ద గల రైతు వేదిక ప్రక్కన టిఆర్ఎస్ చౌటుప్పల్ మండల మరియు మున్సిపల్ ఆత్మీయ సమ్మేళన సమావేశం మంగళవారం నిర్వహిస్తున్న సందర్భంగా సోమవారం మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి సమావేశ ప్రాంగణమును సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. మంగళవారం ఉదయం 9 గంటలకు చౌటుప్పల్ మండల  మున్సిపల్ లోని టిఆర్ఎస్ పార్టీ శ్రేణుల కోసం ఆత్మీయ సమ్మేళన  సమావేశం నిర్వహిస్తున్నామని ఈ కార్యక్రమానికి  మండలంలోని ప్రతి గ్రామం నుండి మరియు మున్సిపల్ పరిధిలోని 20 వార్డుల నుండి టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు 10 వేల మంది   పాల్గొంటున్నారన్నారు.   ఈ ఆత్మీయ సమ్మేళన సమావేశానికి  ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖ మాత్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి
పాల్గొని పార్టీ శ్రేణులకు మునుగోడు బై ఎలక్షన్ సందర్భంగా దిశ నిర్దేశాలు ఇస్తారన్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పార్టీ శ్రేణులకు వనభోజనాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ మున్సిపల్ చైర్మన్ వెన్ రెడ్డి రాజు, మండల పార్టీ అధ్యక్షులు  నిరంజన్ గౌడ్, మున్సిపల్ కమిటీ అధ్యక్షులు ముత్యాల ప్రభాకర్ రెడ్డి, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ బొడ్డు శ్రీనివాస్ రెడ్డి, సింగిల్ విండో చైర్మన్ చింతల దామోదర్ రెడ్డి, కౌన్సిలర్లు కొరగొని లింగస్వామి, సుల్తాన్ రాజ్, నాయకులు గుండెబోయిన వెంకటేష్ యాదవ్, తాడూరి పరమేష్, పాశం సంజయ్ బాబు, తొర్పనూరి నరసింహ గౌడ్, రామిరెడ్డి, గోశిక రవి, గోశిక  నరసింహ, కట్కూరి కిరణ్,  తడక చంద్ర కిరణ్, ఉడుగు మల్లేశం గౌడ్, తదితరులు పాల్గొన్నారు.