సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల హర్షం..

Published: Tuesday September 13, 2022
తల్లాడ, సెప్టెంబర్ 12 (ప్రజాపాలన న్యూస్):
పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ తీసుకున్న నూతన నిర్ణయాన్ని ఉపసంహరించుకొని పాత పద్ధతిలో ఉద్యోగ అవకాశాలు కల్పించాలని మందకృష్ణ మాదిగ ఆధ్వర్యంలో జరిగిన ఉద్యమ ఫలితంగా సీఎం కేసీఆర్ ప్రకటన పట్ల విజయం సాధించామని ఎంఎస్పీ జిల్లా కోఆర్డినేటర్ ఏపూరి వెంకటేశ్వరరావు మాదిగ, దశరథ నాయక్, మూకర ప్రసాద్ తెలిపారు. సోమవారం ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై హర్షం వ్యక్తం చేస్తూ తల్లాడలో ర్యాలీ జరిపి బాణసంచా పేల్చి విజయదరహాసం వ్యక్త పరిచారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్సీ ఎస్టీ బీసీలకు కటా ఫ్ మార్కుల కల్పిస్తామని ప్రకటించడం హర్షనీయమని ఇది ఉద్యమకారుల విజయమని ఈ విజయ స్ఫూర్తిని భవిష్యత్తులో కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇసినేపల్లి అశోక్, అద్దంకి వెంకటేశ్వర్లు, లక్ష్మణ్, మేడి శ్రీను పాల్గొన్నారు.