శరన్నవరాత్రి ప్రత్యేక పూజల్లో పాల్గొన్న మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు

Published: Friday September 30, 2022
మేడిపల్లి, సెప్టెంబర్ 29 (ప్రజాపాలన ప్రతినిధి)
రామంతాపూర్ డివిజన్ నెహ్రు నగర్లోని
 శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత బద్దిపోచమ్మ దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి నిర్వహించిన పూజలలో కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మాజీ కార్పొరేటర్ గంథం జోత్స్నా నాగేశ్వరావు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  అలయ కమిట్టి సభ్యులు జగదీష్,కృష్ణ ,రాజు,బాలకృష్ణ ,తుట్ నరసింహ ,ఉపేందర్,సేనాపతి ,శెట్టి,కుమార్,అంజిబాబు,బాల్ రాజ్,నాగబాబు,తదితరులు పాల్గోన్నారు.