తెలంగాణ ప్రభుత్వ పథకాలు దేశానికే ఆదర్శం --ఎమ్మేల్యే డా.సంజయ్

Published: Monday December 05, 2022

జగిత్యాల, డిసెంబర్ 4 (ప్రజాపాలన ప్రతినిధి): తెలంగాణ రాష్ట్ర పథకాలు దేశానికే ఆదర్శం ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అన్నారు. రాయికల్  మండల అల్లిపూర్ గ్రామానికి చెందిన 30 మంది యువకులు   ప్రభుత్వ అబివృద్ధి, సంక్షేమ పథకాల పట్ల ఆకర్షితులై బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నుండి టీఆరెఎస్ పార్టీ లో చేరగా టీఆరెఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఎమ్మేల్యే డా సంజయ్ కుమార్ ఆహ్వానించినారు. ఎమ్మేల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు పెద్దపీట వేశారన్నారు. సూర్యుణ్ణి అరచేతి తో అపడం సాధ్యం కాని విధంగా కెసిఆర్ సంక్షేమ అభివృద్ధి పథకాలను కూడా అపడం కూడా సాధ్యం కాదు ఎమ్మెల్యే సంజయ్ అన్నారు. ఇప్పటి వరకు 1లక్ష 30 వేల ఉద్యోగ నియామకాలు. ఒక లక్ష ఉద్యోగ నోటిఫికేషన్ లు, జగిత్యాల జిల్లా గా చేసి జిల్లా అభివృద్ధికి మౌలిక సదుపాయాల కల్పన కోసం నిదులు మంజూరు జిల్లా కు మెడికల్ కళాశాల ఏర్పాటు చేశారు అన్నారు. అదనంగా 220 బెడ్  లు నూతనంగా మంజూరు చేయటం జరిగిందని అన్నారు.