ఆర్థిక సహాయం అందజేత

Published: Thursday November 18, 2021
యాదాద్రి నవంబర్ 17 వలిగొండ ప్రజా ప్రతినిధి మండల పరిధిలోని పులిగిల్ల గ్రామంలో బుధవారం ఇటీవల క్యాన్సర్ మహమ్మారి బారిన పడి మృతి చెందిన డివైఎఫ్ఐ మాజీ మండల అధ్యక్షులు వేముల మల్లేష్ యొక్క కుమార్తెల పేర్లపై సిపిఎం గ్రామశాఖ అంబేద్కర్ యూత్ ల ఆధ్వర్యంలో సేకరించిన 41వేల రూపాయలను పోస్టు ఆఫీస్ లో డిపాజిట్ చేసిన బాండ్లను అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీపీఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, సిపిఎం సీనియర్ నాయకులు పులిగిల్ల మాజీ సర్పంచ్ కొమ్మిడి లక్ష్మారెడ్డి లు మాట్లాడుతూ కామ్రేడ్ వేముల మల్లేశ్ కుటుంబానికి అండగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు వాకిటి వెంకట్ రెడ్డి, శాఖ కార్యదర్శి బుగ్గ చంద్రమౌళి, సహాయ కార్యదర్శి మారబోయిన నర్సింహా, దొడ్డి భిక్షపతి, గ్రామ పంచాయితీ వార్డు సభ్యులు వేముల చంద్రయ్య, మామిడి గీతసురేష్, సిపిఎం నాయకులు వేముల ఆనంద్, కొమ్మిడి సత్తి రెడ్డి, వేముల నాగరాజు, కృష్ణ, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.