కెసిఆర్ కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం

Published: Monday October 04, 2021

వలిగొండ ప్రజాపాలన ప్రతినిధి మండల కేంద్రంలో శనివారం జరిగిన రాజీవ్ చౌక్ చౌరస్తాలో విద్యార్థి నిరుద్యోగ సైరన్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల నాయకులపై అక్రమ లాఠీఛార్జి నిరసిస్తూ ఆదివారం మండల కేంద్రంలో కెసిఆర్, కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన మండల కాంగ్రెస్ నాయకులు శాంతియుతంగా నిరసన తెలుపుతుంటే పోలీసులు అరెస్టు చేయడం అన్యాయంఅని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు, లాఠీ ఛార్జీలను సరైనవి కావని ఇవి వారి పతనానికి నాంది అని ఎంపీపీ నూతి రమేష్ అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పాశం సత్తిరెడ్డి, బోల శ్రీనివాస్, కంకల కిష్టయ్య, నాగేశ్వర్, కొమురయ్య, వెంకటేశం, యువకులు తదితరులు పాల్గొన్నారు.