బిజెపి నాయకుల కృషి వల్లనే రైల్వే బ్రిడ్జి

Published: Monday July 19, 2021

... బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్
మంచిర్యాల బ్యూరో, జూలై 18, ప్రజాపాలన : బిజెపి నాయకుల కృషి వల్లనే హమాలి వాడ వద్ద  రైల్వే  బ్రిడ్జి నిర్మాణం జరుగుతుందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు రఘునాథ్ అన్నారు. ఆదివారం మంచిర్యాల పట్టణంలోనీ హమాలి వాడ లో బిజెపి పట్టణ కార్యవర్గ సమావేశం నిరవహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా బిజెపి జిల్లా అధ్యక్షులు రఘునాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయని ఆ సమస్యలు పరిష్కారినికి కార్యకర్తలం దరూ కలిసి పోరాడాలని అన్నారు. పట్టణంలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు అదికంగా అయ్యాయని, ప్రభుత్వ భూములు, చెరువుల శిఖం కబ్జాలకు పాల్పడ్డారని విమర్శించారు. అన్యాక్రాంతం ఐన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకునే అంత వరకు పోరాటం చేయాలని ఆయన కోరారు. అదేవిధంగా రాష్ట్ర.ప్రభుత్వం మంచిర్యాల జిల్లాకు మంజూరు చేసిన మెడికల్ కళాశాల మంచిర్యాల పట్టణంలో ఏర్పాటు చేసి, ఈ విద్యా సంవత్సరం ప్రారంభించాలని డిమాండ్ చేసారు. టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు సంవత్సరాలు అయినా.. ఇప్పటి వరకు ఏ ఒక్కరికీ కూడా డబుల్ బెడ్ రూమ్ కేటాయించలేదని అన్నారు. డబుల్ బెడ్ రూమ్ నిర్మాణంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. మంచిర్యాల పట్టణంలో నెలకొన్న సమస్యల పై రాబోయే రోజుల్లో బిజెపి ప్రజల తరుపున పోరాడుతున్నా రని తెలిపారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు వంగపల్లి వెంకటేశ్వర్ రావు, బోయిని హరికృష్ణ, గాజుల ప్రభాకర రావు, అరుముళ్ళ పోశం, పెద్దపెల్లి  పురుషోత్తం, పురుషోత్తం జాజూ, వెరబెల్లి రవీందర్ రావు, ఆకుల సంతోష్, సోమ ప్రదీప్ చంద్ర, కుదురుపాక గంగన్న, కొండవీటి తిరుమల, రాచకొండ సత్యనారాయణ, ముడారి శ్రీకాంత్, పానుగంటి మధు, తుల ఆంజనేయులు, ముదాం మల్లేష్, బియ్యాల సతీష్ రావు, రంగ శ్రీశైలం, మేన సూరి, సాతిని రాజు, రాజేందర్  మరియు తదితరులు పాల్గొన్నారు.