ఆశా కార్యకర్తలకు యూనిఫాం పంపిణీ కార్యక్రమం

Published: Wednesday December 14, 2022
బోనకల్, డిసెంబర్ 14 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో మంగళవారం ఆశాలకు యూనిఫామ్ పంపిణీ కార్యక్రమం వైద్యాధికారి డాక్టర్ శ్రీకాంత్ అధ్యక్షతన నిర్వహించడం అయినది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల జడ్పిటిసి మోదుగు సుధీర్ బాబు, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం హాజరయ్యారు. ఆశాలకు రెండు జతల యూనిఫాం, చీరలు వారి చేతుల మీదగా పంపిణీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆశా కార్యకర్తల సేవలను కొనియాడారు. ఆశాలు ప్రజలకు అందుబాటులో ఉండి మంచి సేవలను అందించాలని కోరారు. ఆశాలకు ఎలాంటి సహాయ సహకారాలు అయినా అందజేస్తామని వారు హామీ ఇచ్చారు. అదేవిధంగా బోనకల్ వైద్యాధికారి, ఆరోగ్య కేంద్ర సిబ్బంది సేవలను వారు అభినందించారు. బోనకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి 30 పడకల ఆసుపత్రి అవసరం ఉన్నదని, దాని కొరకు ప్రజా ప్రతినిధులుగా మేము దృష్టి సారిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ బాలకృష్ణ, సిహెచ్ఓ శ్రీనివాసరావు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.