సుందరమ్మకు నివాళులు అర్పించిన సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు..

Published: Tuesday January 11, 2022
తల్లాడ, జనవరి 10 (ప్రజాపాలన న్యూస్): తల్లాడ మండలంలోని గోపాలపేట గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ తంబళ్ళ సుందరమ్మ (88) మృతిచెందారు. సోమవారం ఆమె దశదినకర్మ గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ నల్లమోతు మోహన్ రావు, తెదేపా తల్లాడ మండల అధ్యక్షులు కూచిపూడి వెంకటేశ్వరరావు హాజరై ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉప సర్పంచిగా పదవి చేపట్టి గ్రామ ప్రజలకు సేవలు అందించారని కొనియాడారు. కుటుంబ సభ్యులకు తమ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. నివాళులర్పించిన వారిలో నాయకులు పెరసాని వెంకటయ్య, రమేష్, తదితరులు ఉన్నారు.