పారిశుద్ధ్య సిబ్బందికి రైన్ కోట్లు బ్లాంకెట్స్ పంపిణీ

Published: Friday July 23, 2021
మేడిపల్లి, జూలై 22 (ప్రజాపాలన ప్రతినిధి) : వర్ష కాలాన్ని దృష్టిలో పెట్టుకొని పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ 25వ డివిజన్ కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి డివిజన్లో పనిచేస్తున్న మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందికి రైైన్ కోట్లు, బ్లాంకెట్స్, ఎల్ఈడి బల్బ్స్ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ దొంతిరి హరిశంకర్ రెడ్డి మాట్లాడుతూ డివిజన్ను పరిశుభ్రతగా ఉంచడంలో మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు ఎంతో కృషి చేస్తున్నారని తెలిపారు. పారిశుద్ధ్య కార్మికుల సేవలను కొనియాడారు. డివిజన్లోని సమస్యలను పరిష్కరిస్తూ, డివిజన్ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ హరిశంకర్ రెడ్డి తెలిపారు.