ఎమ్మెల్యేలు కలిసిన శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ కమిటీ..

Published: Friday June 25, 2021
పాలేరు, జూన్ 24, ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జీళ్ళచేరువు. గ్రామంలో శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయం పూర్తిగా శిథిలావస్థకు రావడం వలన కొత్తగా గుడి నిర్మాణం చేయడం కొరకు పాలేరు శాసనసభ్యులు కందాల ఉపేందర్ రెడ్డి గారి కలవడం జరిగినది అట్టి గుడి నిర్మాణం గురించి మరియు శంకుస్థాపన కార్యక్రమం గురించి కందాల ఉపేందర్ రెడ్డి గారికి వివరించటం జరిగినది. ఎమ్మెల్యే గారు ఇట్టి విషయం వినగానే మనస్ఫూర్తిగా మనం కొత్త గుడి కట్టుకుందాం అని హామీ ఇవ్వడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్. ఇంటూరి శేఖర్, మరియు ఆలయ సిబ్బంది ఇన్స్పెక్టర్ సమత, AE , చైర్మన్ చెన్న వెంకన్న, శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం చైర్మన్ బొడ్డు నరేందర్, సర్పంచ్ కొండ సత్యం, పాలక మండలి సభ్యులు కొండ వెంకన్న, అర్చకులు శ్రీమన్నారాయణ, స్వామినాథ్, జూనియర్ అసిస్టెంట్ రామదాసు గ్రామ పెద్దలు చిన్న నరసింహ రావు,గోపగాని ముత్తయ్య, అంబాల సత్యనారాయణ, కత్తి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.