పొంచి ఉన్న పెను ప్రమాదo

Published: Monday November 22, 2021

భారీ వర్షాలకు పోరుమల్ల- జోగన్ పల్లి రోడ్ ధ్వంసం

కోరుట్ల, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు,జోగాన్ పల్లి - పోరుమల్ల రోడ్డు తీవ్రంగా దెబ్బతిన్నది. ఈ రోడ్ వెంబడి నుండి నిత్యం వందలాది మంది వాహనదారులు ప్రయాణాలు సాగిస్తుంటారు. శిథిలమైన రహదారి తో ప్రమాదం పొంచి ఉందని ప్రయాణికులు వాపోతున్నారు. ఈ వానాకాలంలో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల రోడ్డు దెబ్బతిన్నది. వానాకాలం ముగిసినప్పటికీ అధికారులు వాటికి మరమ్మతులు చేయలేదు. ముల మలుపు వద్ద వాహనాదారులు అప్రమత్తంగా వుండకపోతే పెను ప్రమాదం సంభవించే ప్రమాదం వుంది. సుమారు 5  ఫీట్ల లోతుకు మట్టి కొట్టుకుపోవడం వల్ల రోడ్ ధ్వంసం అయింది. నెలలు గడుస్తున్న అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించడం లేదు, ఇప్పటికైనా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి మరమత్తులు చేయాలని పొరుమల్ల - జోగన్ పల్లి గ్రామ ప్రజలు వేడుకుంటున్నారు.