దసరాను ఘనంగా జరుపుకోవాలి.. కుర్నవల్లి సొసైటీ చైర్మన్ ప్రదీప్ రెడ్డి..

Published: Thursday October 06, 2022
తల్లాడ, అక్టోబర్ 4 (ప్రజా పాలన న్యూస్): విజయదశమి (దసరా) పర్వదిన వేడుకలను ప్రజలు సంతోషంగా జరుపుకోవాలని కుర్నవల్లి సహకార సొసైటీ చైర్మన్ అయిలూరి ప్రదీప్ రెడ్డి సూచించారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ ఉత్సవాలను రాష్ట్రవ్యాప్తంగా ఎంతో వైభవంగా జరిగాయన్నారు.  తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలు ఉట్టిపడే విధంగా సీఎం కేసీఆర్ మంచి నిర్ణయం తీసుకొని కార్యక్రమాలు చేపట్టారన్నారు. దసరా పండుగ మీ జీవితాల్లో వెలుగులు నింపాలని,  మండల ప్రజలకు ఆయన విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు.