ప్రభుత్వ ఉద్యోగం సాధించిన వారికి ఇదే గార్డెన్డ్స్ లో సన్మానం చేస్తా

Published: Friday June 17, 2022
పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులతో ఎమ్మెల్యే విద్యా సాగర్ రావు
 
కోరుట్ల, జూన్ 16 ( ప్రజాపాలన ప్రతినిధి ):
తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసిన నేపథ్యంలో, పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థుల కోసం డా.కల్వకుంట్ల సంజయ్ ఆధ్వర్యంలో మెట్‌పల్లి పట్టణంలోని వాసవి గార్డెన్స్ లో ఏర్పాటు చేసిన ఉచిత కోచింగ్ సెంటర్ ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు సందర్శించారు.ఈ సందర్బంగా విద్యార్థులతో మాట్లాడిన ఎమ్మెల్యే  ఇంకా ఏమైనా సదుపాయాలు కావాలంటే నేరుగా ఇక్కడ ఉన్న ఫ్యాకల్టీ ని గాని నన్ను గాని సంప్రదించండి అని తెలిపారు.మీకు కోచింగ్ కి కావాల్సినవన్నీ సమకూర్చే బాధ్యత నాదని, మధ్యాహ్నం భోజనం కూడా మీకోసం ఏర్పాటు చేస్తున్న కాబట్టి, కష్టపడి చదివి మంచి ఉద్యోగం సాధిస్తే మీ తల్లిదండ్రులకంటే ఎక్కువ సంతోషపడే వ్యక్తిని తనని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించాక ఇదే గార్డెన్డ్స్ లో మీకు సన్మానం చేస్తానని, విద్యార్థులకు అల్ ది బెస్ట్ తెలిపారు.