కొద్దిపాటి కురిసిన వర్షానికి రోడ్డు నీటి మయం
Published: Wednesday May 19, 2021
బాలపూర్, మే 18, ప్రజాపాలన ప్రతినిధి : 21 వ డివిజన్ లో ఉన్న గాయత్రి నగర్ కు వెళ్ళే రోడ్డును పట్టించుకునేవారే కరువయ్యారుని ప్రజలు వాపోతున్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 21వ డివిజన్ లో ఉన్నటువంటి లార్డ్ స్కూల్ మూల పైన కుడివైపు రోడ్డు నుండి గాయత్రీ నగర్ చౌరస్తా వరకు వెళ్లి మెయిన్ రోడ్డు రాత్రి కురిసిన కొద్దిపాటి వర్షానికి గుంటలు (గుంతలు) పడి రోడ్డు నీటి మాయమైంది. మున్సిపల్ అధికారులు గాని, స్థానిక కార్పొరేటర్ పట్టించుకునే వారేకరవయ్యారని, వాహనదారులు, కాలనీవాసులు, సీతా హోమ్స్ కాలనీ వాసులు బాటసారులు, ఆవేదన వ్యక్తపరిచారు. మాజీ ఎంపీపీ, టిఆర్ఎస్ కార్పొరేషన్ అధ్యక్షురాలు ప్రస్తుతం కార్పొరేషన్ కార్పొరేటర్ అయినా ఈ రోడ్డుకు కనీసం మట్టి కూడా కొట్టించడానికి తీరిక లేకపోవడం, ప్రజలు పడుతున్న బాధలు సమస్యలు ఏప్పటికే తీరవాని కాలనీ వాసులు అందరూ అంటున్నారు. ఇప్పటికైనా స్పందించి స్థానిక కార్పొరేటర్ సీతా హోమ్స్ కుడివైపున ఉన్న రోడ్డు ను మట్టితోనైన లేదా మొరంతోనైన గుంతలు లేకుండా చదును చేయగలరని విజ్ఞప్తి చేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా మహమ్మారి తీవ్రతను అదేవిధంగా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా అతి తొందరలో ఇలాంటి సమస్యలను అధిక మించకుండా పరిష్కరించగలరని కాలనీ వాసులు అందరూ కోరారు.
Share this on your social network: