నూతన కళతో అలరించనున్న శివసాగర్
Published: Wednesday August 18, 2021
వికారాబాద్ బ్యూరో 17 ఆగస్ట్ ప్రజాపాలన : శివసాగర్ లో మినీ ట్యాంక్ బండ్ పార్క్ ఏర్పాటుతో నూతన కళ సంతరించుకోనున్నదని వికారాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ అన్నారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని వికారాబాద్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శివా రెడ్డి పేట్ (శివసాగర్) చెరువు సమీపంలో మినీ ట్యాంక్ బండ్ పార్క్ ఏర్పాటు గురించి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రానున్న రోజుల్లో శివసాగర్ పరిసర ప్రాంతంలో పార్క్, మినీ ట్యాంక్ బండ్ ఏర్పాటు కోసం ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు సూచించారు. నూతనంగా నిర్మించనున్న పార్క్ లో అన్ని ఏర్పాట్లు ఉండేలా తగిన చర్యలు పేర్కొన్నారు. ఈ ప్రణాళిక వలన పరిసర ప్రాంత ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని ఉద్ఘాటించారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్ పర్సన్ చిగుళ్ళపల్లి మంజుల రమేష్, ఆర్డీఓ ఉపేందర్ రెడ్డి, మున్సిపల్ కమిషనర్ శరత్ చంద్ర, మున్సిపల్ డిప్యూటి ఈఈ వెంకటేశ్వరరావు, ఎంఆర్ఓ రవీందర్, సర్వేయర్ మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: