గజ్వేల్ దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు తరలిరండి : మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్

Published: Friday September 17, 2021
వికారాబాద్ బ్యూరో 16 సెప్టెంబర్ ప్రజాపాలన : వికారాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులు గజ్వేల్ లో జరిగే దళిత గిరిజన ఆత్మగౌరవ దండోరా సభకు తండోప తండాలుగా తరలి రావాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 17 సెప్టెంబర్ 2021 శుక్రవారం గజ్వేల్ లో జరగబోయే దళిత గిరిజన-ఆత్మ గౌరవ దండోరా సభకు సీనియర్ నాయకులు, సర్పంచ్ లు, మాజీ సర్పంచులు, మాజీ ప్రజా ప్రతినిధులు, ఎస్సీ సెల్, బిసి సెల్, ఎస్టీ సెల్, మైనార్టీ సెల్, మహిళ సెల్, కిసాన్ సెల్, యువజన నాయకులు, సోషల్ మీడియా నాయకులు‌, కాంగ్రెస్ పార్టీ సైనికులు అందరూ రామదండులా కదిలి రావాలని కోరారు.