ఇబ్రహీంపట్నం జనవరి తేదీ 26 ప్రజాపాలన ప్రతినిధి *74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా విద్యార్థులక

Published: Friday January 27, 2023

స్టడీ మెటీరియల్ ను అందజేసిన జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  ఇబ్రహీంపట్నం నియోజకవర్గం లో అన్ని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి సంవత్సరం 10వ తరగతి చదువుతున్న తెలుగు మరియు ఇంగ్లీష్ మీడియం విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్  ఆల్ ఇన్ వన్ మర్రి రెడ్డి ఫౌండేషన్  ద్వారా అందజేస్తున్నారు, అందులో భాగంగా ఈరోజు మంచాల మండలం రంగాపూర్ మరియు ఆంబోత్ తండా స్కూళ్లలో తెలుగు ఇంగ్లీష్ మీడియం స్టడీ మెటీరియల్ ను ఉచితంగా మంచాల జడ్పిటిసి మర్రి నిత్య నిరంజన్ రెడ్డి  విద్యార్థినీ విద్యార్థులకు అందజేశారు, ఈ సందర్భంగా జెడ్పిటిసి  మాట్లాడుతూ విద్యార్థులు కష్టపడి తల్లిదండ్రులకు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు, రంగాపూర్ పాఠశాలలో ఎగ్జామ్ ప్యాడ్స్ మరియు మెటీరియల్స్ ను  ఎమ్మెన్నార్  యువసేన టీం సభ్యులు ఇటికల గోవర్ధన్ రెడ్డి గారు విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు, ఈ కార్యక్రమంలో రంగాపూర్ సర్పంచ్ మమత అజయ్ బాస్, ఎంపీటీసీ నార్సింగ్ అనిత వెంకటేష్ గౌడ్, ఎంపీటీసీలు జయానందం, మధుసూదన్ రెడ్డి, మండల కో ఆప్షన్ సభ్యులు వాజిద్ భాయ్, ఎమ్మెన్నార్ యువసేన ప్రెసిడెంట్ కమలాకర్ రెడ్డి, యువజన కాంగ్రెస్ అధ్యక్షు తదితరులు పాల్గొన్నారు.