డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రాయ్ విగ్రహాల ఏర్పాటుకై భూమి పూజ

Published: Friday February 25, 2022

రాయికల్, ఫిబ్రవరి 24;( ప్రజా పాలన ప్రతినిధి): రాయికల్ మండలం ధర్మాజీ పేట గ్రామంలో వై.ఎం.ఎస్.(Y.M.S.)యూత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్అంబేద్కర్, బాబు జగ్జీవన్ రామ్ నూతన విగ్రహలను నెలకొల్పు టకు రాయికల్ మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు లౌడియా సంధ్యారాణి సురేంద్ర నాయక్ భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ మారంపల్లి స్నేహ హరీష్, ఉప సర్పంచ్ పాలకుర్తి వెంకటేష్, గ్రామ రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్ వెంకటేశ్వరరావు, రాయికల్ మండల బిసి మరియు ఎస్ టి సెల్ ప్రధాన కార్యదర్శులు బొడ్డుపల్లి రాజశేఖర్, భూఖ్య తిరుపతి, వార్డు మెంబర్లు లక్ష్మీరాజం, మల్లయ్య, గ్రామ నాయకులు గంగారెడ్డి, తిరుపతి, సంజీవ్ నరసయ్య, వై  ఎం ఎస్ యూత్ సభ్యులు రాజేందర్, అరవింద్ రామ్, లక్ష్మణ్  మనోహర్ రాకేష్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.