బీసీ జాగృతి పట్టణ స్థాయి పూర్తి కార్యవర్గం ఎన్నిక

Published: Thursday September 02, 2021
మంచిర్యాల బ్యూరో, సెప్టెంబర్ 01, ప్రజాపాలన : బీసీ జాగృతి పట్టణ స్థాయి పూర్తి కార్యవర్గాన్ని బుధవారం జిల్లా కేంద్రంలో ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో నిర్వహించిన సమావేశంలో ఎన్నుకున్నట్లు అ సంఘం జిల్లా కార్యదర్శి గుమ్ముల శ్రీనివాస్, పట్టణ అధ్యక్షులు మడుపు రామ్ ప్రకాష్ లు తెలిపారు. ఈ నూతన కార్యవర్గంలో ఉపాధ్యక్షులు మేంత్యాల సంతోష్, వైద్య భాస్కర్, ఎడ్ల పున్నం, గంధ శ్రీ తిరుపతి, కార్యదర్శులుగా తోకల మహేష్, దాగే లక్ష్మణ్, కీర్తి బిక్షపతి, సహయ కార్యదర్శులుగా గరబోయిన శ్రీనివాస్, బద్ది శ్రీను, సంయుక్త కార్యదర్శులుగా గుమ్ముల శ్రీను, కనకరాజు, కార్యనిర్వాహక కార్యదర్శి గా కాగితాల సత్యనారాయణ, మంచర్ల వెంకట స్వామి, ప్రచార కార్యదర్శిగా కీర్తి రవి, నగునూరి లక్ష్మణ్, సలహాదారులు గా బోయిన ఓదేలు, బండవరం రంగనాథస్వామి, కార్యవర్గ సభ్యులుగా బొలిశెట్టి పోషం, మత్సయ్యా చారి, కొదురుపాక రవీందర్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నాట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దేవరకొండ విజయ భాస్కర్, నార్ల మహేందర్, చొప్పరి రామస్వామి, బైర మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.