జీవన్ రెడ్డి త్వరగా కోలుకోవాలని పూజలు

Published: Thursday July 15, 2021
సారంగాపూర్, జులై 14 (ప్రజాపాలన ప్రతినిధి) : సారంగాపూర్ మండల్ పెంబట్ల శ్రీ దుబ్బరాజేశ్వర స్వామి దేవాలయంలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి కరోనా పాజిటివ్ రావడంతో ఆయన త్వరగా కోలుకోవాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కొండ్ర రాంచందర్ రెడ్డి సర్పంచులు బొడ్డుపల్లి రాజన్న ఆకుల జమునరాజిరెడ్డి మోదుకూరు ప్రసాద్ ఎండి ఇబ్రహీం కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.