మసీదు నిర్మాణానికి బీజేపీ యువనేత బీపీ నాయక్ ఆర్థిక సాయం ఆర్థిక సాయం అందించిన బి పి నాయక్ కు అ

Published: Friday July 08, 2022

బోనకల్, జులై 8 ప్రజా పాలన ప్రతినిధి: బీజేపీ యువనేత బీపీ నాయక్ మండల పరిధిలోని గోవిందపురం(ఎల్) మసీదు నిర్మాణానికి ముస్లిం సోదరులుకు అండగా నిలిచి ఆర్థిక సాయాన్ని అందించారు. బుధవారం రాత్రి ఏర్పాటుచేసిన ముస్లిం సోదరుల ఆత్మీయ సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్న యువనేత బీపీ నాయక్ మాట్లాడుతూ గ్రామంలో చక్కని ఆహ్లాద వాతావరణం లో మసీదు కట్టడాన్ని నిర్మిస్తున్నందుకు కమిటీ వారికి, గ్రామస్తులకు అభినందనలు తెలిపారు. ఇంతటి మహత్తర కార్యక్రమాన్ని యజ్ఞంగా తీసుకున్న ముస్లిం సోదరులు, ముఖ్యంగా కమిటీ సంకల్పశక్తిని కొనియాడారు. ఈ స్థలం నుండి సమాజానికి మంచిని, సత్ప్రవర్తనను నేర్పాలని సూచించారు. అనంతరం యువ మోర్చా మండల అధ్యక్షులు కాలసాని పరశురామ్, సేవాలాల్ సమితి ఉపాధ్యక్షుడు భూక్య రమేష్ నాయక్ లు మాట్లాడుతూ మసీదు నిర్మాణానికి నిధులు సరిపోక ఆపదలో ఉన్న ముస్లిం సోదరులు వారు తమని సంప్రదించగా యువనేత బీపీ నాయక్ దృష్టికి తీసుకువెళ్లామని, యువనేత హామీ ఇచ్చిన అతికొద్ది రోజుల్లోనే ఆర్థిక సహాయాన్ని అందించారు. ముస్లిం సోదరులు వారికి ఎంతో రుణపడి ఉంటామని అన్నారు. కులమతాలకు అతీతంగా గుడి -బడి అనే నినాదం ఆర్థిక సాయం అందిస్తున్న బీపీ నాయక్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కిషోర్, సైదులు, రంజాన్ సాహెబ్ , పెంటు సాహెబ్, మదర్, సాజని మియా, సైదులు అక్కబర్, ముస్లిం సోదరులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.