జగిత్యాల జిల్లా జనరల్ ఆసుపత్రినీ ఆకస్మిక తనిఖీ చేసిన ఎమ్మేల్యే డా. సంజయ్
Published: Saturday July 30, 2022
జగిత్యాల, జూలై, 29 ( ప్రజాపాలన ప్రతినిధి): జిల్లా జనరల్ ఆసుపత్రినీ ఎమ్మేల్యే డా. సంజయ్ కుమార్ ఆకస్మిక తనిఖీ చేసినారు. ఆసుపత్రిలో రోగులతో మాట్లాడుతూ వారి సమస్యలు వింటూ, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు, ఆసుపత్రి కి రోగులు వస్తే నాణ్యమైన వైద్యం అందే విధంగా నమ్మకం కలిగించాలని కోరారు. 2.25 కోట్లతో నూతనంగా ఏర్పాటు చేయనున్న సిటీ స్కాన్ గదిని పరిశీలించి మూడు నెలల్లో అందుబాటులోకి వస్తుందనీ తెలియజేశారు. ఎమ్మేల్యే వెంట సుపరిందెంట్ లు డా. రాములు, సుదక్షిన దేవి, ఆర్ఎంఓ రామకృష్ణ, వైద్యులు శ్రీదర్, వినోద్, నవీన్, రమేష్, శృతి, నర్సింగ్ సుపరిందెంట్ ప్రభలత, కౌన్సిలర్ పిట్ట ధర్మరాజు, తదితరులు పాల్గొన్నారు.
Share this on your social network: