వైభవంగా శ్రీ శ్రీ శ్రీ వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవం

Published: Tuesday March 29, 2022
ఇబ్రహీంపట్నం మార్చి 28 ప్రజాపాలన ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం కప్పపహాడ్ గ్రామంలో శ్రీ వేంక‌టేశ్వ‌ర స్వామి క‌ళ్యాణం అత్యంత వైభ‌వంగా జ‌రిగింది టీఆర్ఎస్ రాష్ట్ర యువ నాయకులు  మంచిరెడ్డి ప్రశాంత్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా హాజరై ఇబ్రహీంపట్నం ఎంపీపీ కృపేష్, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు ఏనుగు భరత్ రెడ్డి,తెరాస పార్టీ మండల అధ్యక్షులు చిలకల బుగ్గరాములు, టీఆర్ఎస్వీ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం అధ్యక్షులు నిట్టు జగదీశ్వర్ తో యువజన విభాగ అధ్యక్షుడు జర్కొని రాజు, కలసి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తన వంతు ఆలయాల అభివృద్ధికి కృషి చేస్తానని, స్వామివారి కృపకు, శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీర్వాదాలు ప్రజలకు ఎల్లప్పుడూ ఉండాలని కోరారు, ఈ సందర్బంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో వారిని ఘనంగా సన్మానించడం జరిగింది అతిథులు, అనేక మంది ఆహ్వానితులు, భ‌క్తుల మ‌ధ్య శ్రీమాన్ తిరుమల వింజమూరు రామానుజచార్యులు ఆధ్వ‌ర్యంలో క‌న్నుల పండుగ‌గా నిర్వ‌హించారు. వేద పండితుల మంత్రోచ్ఛార‌ణ‌ల మ‌ధ్య స్వామి వారి క‌ళ్యాణం జ‌రిగింది. కళ్యాణం అనంతరం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో సర్పంచ్ సామల హంసమ్మ యాదగిరి రెడ్డి, ఉప సర్పంచ్ మహమ్మద్, ఏ ఈ ఇంద్రసేనారెడ్డి  మునీర్, తెరాస పార్టీ గ్రామం అధ్యక్షులు ఉడుతల జలందర్ గౌడ్, ఆలయ కమిటీ చైర్మన్ బూడిద మల్లా రెడ్డి, తెరాస మండల్ నాయకులు సామల శ్రీనివాస్ రెడ్డి, జి.భాస్కర్ రెడ్డి, సీనియర్ నాయకులు కో- ఆప్షన్ సభ్యులు ఉడుతల సతీష్ గౌడ్, బూడిద జై భారత్ రెడ్డి, ఉడుతల శంకరయ్య గౌడ్, మాజీ సి ఏ పీ ఎస్ డైరెక్టర్ నిట్టు వీరయ్య, ఏర్పుల యాదయ్య, జంగలి మహేష్, శంకర్, బుట్టి శ్రీనివాస్, మహాపిల్, కిషన్, జంగలి శివ, శేకర్, బలుదేవ్ రెడ్డి, ఏనుగు నరేందర్ రెడ్డి యాదయ్య, తెరాస పార్టీ నియోజకవర్గం యువజన అధ్యక్షులు జెర్కొని రాజు, బద్రీనాథ్ గుప్తా, నిమ్మల ప్రసాద్, మనీష్, పి రాజ్ కుమార్, ఏనుగు టిల్లు, వీరేష్ ముదిరాజ్, శివరెడ్డి నిట్టు మధు, జంగిలి శివ, బుట్టి చంటి, గ్రామస్థులు పెద్ద ఎత్తున భక్తులు తదితరులు పాల్గొన్నారు.