ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం మండల పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ

Published: Tuesday March 07, 2023

బోనకల్, మార్చి 6 ప్రజా పాలన ప్రతినిధి: మండల కేంద్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సోమవారం ఘనంగా జరుపుకున్నారు.అంతర్జాతీయ మహిళా దినోత్సవం" సందర్భంగా మండల పరిషత్ ఆధ్వర్యంలో ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఐసిడిఎస్, ఐకెపి శాఖలతో పాటు మహిళా ఉద్యోగులందరికీ సమావేశం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మధిర సివిల్ కోర్టు నుండి న్యాయ సలహాదారు హాజరై న్యాయ సేవలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహిళ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళా శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు. వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవం, గుర్తింపు నిస్తోంది. ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక, రాజకీయ, సామాజిక సాధనల ఉత్సవంగా వుంటుంది. సామ్యవాద రాజకీయ ఘటనగా ప్రారంభమై, వివిధ దేశాల్లో ఇంకొన్ని ప్రాంతాలలో మానవీయ హక్కులు బలంగా వుండి ప్రపంచవ్యాప్తంగా మహిళల రాజకీయ, సామాజికహక్కుల పోరాటంపై జాగృతి పెంచే విధంగా జరుపుతారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో బోడెపూడి వేణుమాధవ్, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం, స్నేహాంజలి మండల సమైక్య ఏపిఎం పద్మలత, ఏపీవో బసవోజు కృష్ణకుమారి, ఐసిడిఎస్ సిడిపిఓ, అంగన్వాడి సూపర్వైజర్ రమాదేవి,మండల సమైక్య అధ్యక్షురాలు సోనీ, అంగన్వాడీ టీచర్లు, ఆశా కార్యకర్తలు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.