పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన డిఈఓ

Published: Monday November 22, 2021

కోరుట్ల, నవంబర్ 21 (ప్రజాపాలన ప్రతినిధి) : కల్లూరు గ్రామంలో ఉన్నటువంటి కస్తూరిబా గాంధీ పాఠశాలను జగిత్యాల జిల్లా డిఇఓ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అందులో భాగంగా విద్యార్థులందరూ మంచి క్రమశిక్షణ తో వ్యక్తిగత పరిశుభ్రత తో పాటు పరిసరాల పరిశుభ్రత కూడా ఖచ్చితంగా పాటించాలన్నారు. స్కూల్లో ఉన్నటువంటి అన్ని తరగతి గదులను పర్యవేక్షించి వారికి కావలసిన సౌకర్యాలను కల్పిస్తామని అలాగే వారు కూడా ప్రతినిత్యం తీసుకోవాల్సిన జాగ్రత్తలను కూడా చెప్పారని, డీఈవో జగన్మోహన్ రెడ్డి విద్యార్థులను ఉద్దేశించి చాలా విలువైన సూచనలు జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారని గ్రామ సర్పంచ్ వనతడుపుల అంజయ్య తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల ఎంఈఓ గంగుల నరేష్, స్థానిక స్కూల్ ఎస్ ఓ ఇన్చార్జి మేడం, హెచ్ఎం భూపతి, స్కూల్ విద్యార్థినిలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.