అన్నారుగూడెం ఘనంగా సాయిబాబా వార్షికోత్సవం..

Published: Tuesday February 28, 2023
తల్లాడ, ఫిబ్రవరి 27 (ప్రజా పాలన న్యూస్): 
తల్లాడ మండలంలోని అన్నారుగూడెం గ్రామంలో సాయిబాబా 15వ వార్షికోత్సవం సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సాయిబాబా ఆలయంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం బాబాను పల్లకి సేవలో ఊరేగింపు చేశారు. గ్రామ సర్పంచ్ మారెళ్ళ మమత, ఆలయ కమిటీ చైర్మన్ మారెళ్ళ లక్ష్మణరావు, పుష్పావతి దంపతులు పల్లకిని మోశారు. తొలుత మహిళలు కోలాటం, డప్పు వాయిద్యాలు మధ్య గ్రామంలో ఊరేగింపు నిర్వహించారు. భక్తులు బాబాకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేక తీర్థప్రసాదాలను స్వీకరించారు.  నేడు (28వ తేదీన) చివరిరోజు కావడంతో గ్రామంలో భారీ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, నిర్వాహకులు పాల్గొన్నారు.*