అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య వర్ధంతి వేడుకల

Published: Friday May 20, 2022
రూరల్ మధిర 19 మేప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో గురువారం నాడుభారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాత, అమరజీవి కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య  వర్ధంతి సందర్భంగా గురువారం  మధిర వర్తక సంఘం కల్యాణ మండపంలో సీపీఎం పార్టీ మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి అధ్యక్షతన ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా రాజకీయ  శిక్షణా తరగులనునిర్వహించారు.ఈశిక్షణా  తరగతులలో వక్తలు  అఖిల భారతీయ మహాసభ తీర్మానం పార్టీ నిర్మాణం గురించి సీపీఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులుపొన్నం.వెంకటేశ్వరావు,శాస్త్రీయ ఆలోచన,మతోన్మాదం గురించి సీపీఎం జిల్లా నాయకులు బండారు.రమేష్ లు పార్టీ నాయకులు, కార్యకర్తలకు వివరంగా బోధించారు. 
ఈ కార్యక్రమంలో మధిర మండలం  సీపీఎం పార్టీ కార్యదర్శి మండవ సైదులు,సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శీలం. నరసింహారావు,డి వై యఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు మద్దాల ప్రభాకర్,సీఐటీయూ  నాయకులు పడకండి. మురళి,పట్టణ కమిటీ సభ్యులు రాధాకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.