బాధిత కుటుంబాన్ని పరామర్శించిన కవ్వంపల్లి

Published: Saturday February 04, 2023
శంకరపట్నం ఫిబ్రవరి 03 ప్రజాపాలన ప్రతినిధి:


శంకరపట్నం మండలం కేశవపట్నం గ్రామానికి చెందిన సుద్దాల శంకరస్వామి అనారోగ్యంతో ఇటీవలే మృతి చెందగా, బాధిత కుటుంబాన్ని శుక్రవారం కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కవ్వంపల్లి సత్యనారాయణ, మృతుడు శంకర్ స్వామి కుటుంబ సభ్యులను  పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ కేశవపట్నం గ్రామ అధ్యక్షుడు మొలంగూరి సదానందం, వార్డు సభ్యుడు పూరెల్ల ప్రశాంత్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.