మసీదుల్లో బక్రీద్ ఏర్పాట్లు చేయాలని వినతి

Published: Tuesday July 20, 2021
మెట్ పల్లి, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి) : బక్రీద్ పండుగ సందర్భంగా పట్టణంలోని మసీదులు, ఈద్గాల వద్ద మున్సిపల్ ఆధ్వర్యంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని కోరుతూ మెట్ పల్లి మర్కజి ఇంతేజామి కమిటీ మిల్లాత్ ఎ ఇస్లామియా సభ్యులు సోమవారం మున్సిపల్ కమిషనర్ సమ్మయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మసీదుల్లో, ఈద్గాలా వద్ద పారిశుద్ధ్య పనులు చేపట్టడంతో పాటు నమాజులు చేసుకోవడానికి ఏర్పాట్లు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మెట్ పల్లి మర్కజి ఇంతేజామి కమిటీ మిల్లాత్ ఎ ఇస్లామియా సభ్యులు తదితరులు పాల్గొన్నారు.