ఉచిత కంటి వెలుగు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోండి గ్రామ సర్పంచ్ రావూరి శివ నాగకుమరీ

Published: Thursday February 02, 2023
మధిర రూరల్ ఫిబ్రవరి 1 ప్రజాపాలన ప్రతినిధి మండలం పరిధిలో బుధవారం నాడుమాటూరుపేట గ్రామంలో కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించిన.సర్పంచ్ రావురి శివనాగకుమారితెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రెండో విడత కంటి వెలుగు కార్యక్రమ శిబిరాన్ని గ్రామంలో పంచాయతీ కార్యాలయ ఆవరణ నందు బుధవారం గ్రామ సర్పంచ్ రావూరి శివనాగకుమారి ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ. రెండోవిడత కంటి సమస్యలు ఉన్న ప్రతి ఒక్కరూ ఉచిత కంటి వెలుగు శిబిరంలో పరీక్షలు చేయించుకొని కళ్లద్దాలను, మందులను ఉచితంగా పొందవచ్చు అన్నారు.దూరపు చూపు,దగ్గర చూపు సమస్యలు ఉన్న వారు కూడా పరీక్షలు చేయించుకొని అవసరమైన మందుల శిబిరంలో పొందవచ్చు అన్నారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో విజయభాస్కర్ రెడ్డి, కంటి వెలుగు శిబిరం ఇన్చార్జి డాక్టర్ సంగేపు గోపి,ప్రభుత్వ హాస్పిటల్ సూపర్వైజర్ భాస్కరరావు, పంచాయతీ సెక్రెటరీ ఐలూరి నరేందర్ రెడ్డి, వెలుగు సిసి మేడూరి మురళీకృష్ణ, గ్రామస్తులు తాటికొండ వెంకటేశ్వరరావు, రావూరి రామారావు, మాజీ సర్పంచ్ బోల్లెద్దు వెంకయ్య, తల్లపురెడ్డి నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.