కేసీఆర్ నిరుద్యోగ ఉద్యోగ ప్రకటన పై కేసీఆర్ చిత్రపటానికి క్షీరాభిషేకం.

Published: Thursday March 10, 2022

మధిర మార్చి 9 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలో బుధవారం నాడు టిఆర్ఎస్ కార్యాలయంలో తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుద్యోగ యువతకు శుభవార్త అందిస్తూ 91142 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలకు ప్రకటన చేయటం పట్ల మధిర టిఆర్ఎస్ కార్యాలయంలో నియోజకవర్గ యూత్ కన్వీనర్ నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్రపటానికి నిరుద్యోగులు క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా నిరుద్యోగులు మాట్లాడుతూ ఎంతో కాలంగా ఉద్యోగాల కోసం నిరాశ నిస్పృహలతో ఎదురు చూస్తున్న మాకు ఉద్యోగ భరోసానిస్తూ ఇంత పెద్ద ఎత్తున ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటన చేయటం ఎంతో హర్షనీయమని నిరుద్యోగ లోకం ఆనందం వ్యక్తం చేశారు. అదేవిధంగా ఓబీసీలకు తొమ్మిది సంవత్సరాలు వయోపరిమితి పెంచడం పట్ల అర్హత సాధించిన టువంటి నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్  మా నిరుద్యోగుల పాలిట దేవుడు అని కొనియాడారు. ఆనందోత్సవాలు నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమంలో నిరుద్యోగులు సాయి కృష్ణ రెడ్డి, ప్రకాష్ స్వామి, వేల్పుల శివ, వాల్మీకి పవన్, నరేష్రమేష్ బాబు, విజయ్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిత్తారు నాగేశ్వరరావు, ఆత్మ కమిటీ చైర్మన్ రంగిశెట్టి కోటేశ్వర రావు, పట్టణ అధ్యక్ష కార్యదర్శులు కనుమూరి వెంకటేశ్వరరావు అరిగె శ్రీనివాసరావు రైతుబంధు కన్వీనర్ చావా వేణు, శ్రీనివాస రాజు మహిళా నాయకురాలు భోగ్యం ఇందిర తదితరులు పాల్గొన్నారు.