అఖిల పక్ష ధర్నాకు భారీగా తరలిన కాంగ్రెస్ శ్రేణులు
Published: Thursday September 23, 2021
మేడిపల్లి, సెప్టెంబర్ 22 (ప్రజాపాలన ప్రతినిధి) : ఇందిరాపార్కు వద్ద అఖిలపక్ష పార్టీల ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నాకు ఉప్పల్ ఏ బ్లాక్ నుంచి పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ శ్రేణులు తరలి వెళ్ళారు. కాంగ్రెస్ పార్టీ ఏ బ్లాక్ అధ్యక్షుడు మందముళ్ళ పరమేశ్వర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులు బోరంపేట కృష్ణ, తెల్కల మోహన్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు బాకారం లక్ష్మణ్, ప్రకాష్ రెడ్డి కొంపల్లి బాలరాజ్, నవీన్, తడవబోయిన గిరి బాబు, సురేష్, లూకాస్ సుధాకర్, అలీం అద్వర్యంలో బుధవారం భారీ సంఖ్యలో తరలి వెళ్ళారు.
Share this on your social network: