ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య

Published: Wednesday August 11, 2021
హైదరాబాదు 10 ఆగష్టు ప్రజాపాలన:  శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీని కలిసిన మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు జి.చెన్నయ్య. మంగళవారం నాడు శేరిలింగంపల్లి శాసనసభ్యుడు అరికెపూడి గాంధీని మరియు స్థానిక కార్పొరేటర్ అయిన జగదీష్ గౌడ్ ను మర్యాద పూర్వకంగా కలిసినట్లు మాల మహానాడు జాతీయ అధ్యక్షులు  జి.చెన్నయ్య తెలిపారు. తదుపరి స్మశాన వాటిక  అంబేద్కర్ భవనం మరియు ఇతర విషయాల పై నాయకులతో చర్చించడం జరిగినదని తెలిపారు. ఈ విషయంపై ఎమ్మెల్యే మరియు స్థానిక  కార్పొరేటర్ వెంటనే స్పందించారన్నారు. ఒక ఎకరా స్థలం కేటాయించి ఇస్తాం అని తెలిపారన్నారు. శేరిలింగంపల్లి శాసనసభ్యులు మరియు ఇతర నాయకులకు చెన్నయ్య ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో రైలు కృష్ణ రంగస్వామి మరియు స్థానిక  నాయకులు పాల్గొన్నారు.