యాదవ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఆనందయ్యకు సన్మానం

Published: Tuesday August 10, 2021
మేడిపల్లి, ఆగస్టు9 (ప్రజాపాలన ప్రతినిధి) : ఉద్య యూనిటీ మరియు డెవలప్మెంట్ ఆఫ్ యాదవ్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఫౌండర్ మేక లలిత యాదవ్, తెలంగాణ అధ్యక్షులు మేకల శ్రీనివాస్ యాదవ్, ఆంధ్రరప్రదేశ్ అధ్యక్షులు  పెయ్యాల ఈశ్వర్ యాదవ్, తెలంగాణ వర్కింగ్ అధ్యక్షులు బి సత్యనారాయణ యాదవ్, గ్రేటర్ హైదరాబాద్ మహిళ అధ్యక్షురాలు సమత యాదవ్, మేడ్చల్ మహిళ అధ్యక్షురాలు ప్రభావతి యాదవ్ మరియు ఉద్య సభ్యులతో కలిసి మన జాతి రత్నం ఎంతో మందిని కరోనా భారీ నుండి కాపాడిన ఆనందయ్య యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆనందయ్యా యాదవ్  మాట్లాడుతూ కరోనా లాక్డౌన్ సమయంలో కూడా  ఉద్య ఫౌండర్ మేక లలిత  ఆధ్వర్యంలో తెలంగాణ మరియు ఆంధ్ర ప్రదేశ్ నుండి అధిక సంఖ్యలో వచ్చి లలిత నాకు అండగా నిలిచారనిి, వారు నా మందు తిరిగి మరల పంపిణీకి తన వంతు కృషి చేశారని వారికి ధన్యవాదాలు తెలిపారు. తన మందు తిరిగి పంపిణీ చేయడానికి మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఉద్య చేసే సేవలను కొనియాడారు.