మండలంలో పర్యటించిన జడ్పీ చైర్మన్ లింగాల

Published: Friday March 10, 2023

బోనకల్, మార్చి 9 ప్రజా పాలన ప్రతినిధి: మండలంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు గురువారం పర్యటించి పలువురిని ఆశీర్వదించి, పలు కుటుంబాలను పరామర్శించారు. ముందుగా ముస్తికుంట్ల గ్రామం లో పిల్లలమర్రి వెంకటేశ్వరరావు ఇటీవల మరణించడంతో వారి చిత్రపటానికి పూలమాలలతో నివాళులు అర్పించి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.అనంతరం రాపల్లి గ్రామం లో తోట లింగయ్య కుమారుని వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ మాజీ మండల అధ్యక్షులు బంధం శ్రీనివాసరావు, రజక సంఘం నాయకులు తమ్మారపు బ్రహ్మయ్య, బుక్య సైదులు, వివిధ హోదాల్లో ఉన్న ప్రజాప్రతినిధులు, బిఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.