*అప్పన్న హస్తంగా సీఎంఆర్ఎఫ్* *ఆపదలో ఉన్న ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటాం : జడ్పిటిసి పట్నం అవినా

Published: Wednesday January 18, 2023
*ప్రజాపాలన షాబాద్* := *ఆపదలో ఉన్న వారికి సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయం
 అప్పన్న హస్తంగా అందించి
ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని షాబాద్ జడ్పిటిసి పట్నం అవినాష్ రెడ్డి అన్నారు. 6 మంది లబ్ధిదారులకు 2 లక్షల 50 వేల సీఎంఆర్ఎఫ్ ఆర్థిక సహాయాన్ని పంపిణీ చేశారు.మండలంలోని సీతారాంపురం గ్రామానికి చెందిన డప్పు పుష్పలత వెన్న ముక్క ఇబ్బందులతో సతమతమై ఆసుపత్రిపాలై చికిత్స పొందిన నేపథ్యంలో 36 వేలు , అనారోగ్యం పాలైన డప్పు లక్ష్మమ్మ 60000,
గతంలో రోడ్డు ప్రమాదంలో త్రీవ్రంగా 
గాయపడి మృతి చెందిన మద్దూర్ గ్రామానికి చెందిన వెంకటయ్య భార్య నరసమ్మకు 76 వేల, కే నర్సింలు కుటుంబానికి 60000 అనారోగ్యానికి గురైన బబ్బిలిగామ గ్రామానికి చెందిన యాదవ రెడ్డి కొడుకు పురుశోత్తమ రెడ్డికి 22 వేల 
  సీఎం ఆర్ ఎఫ్ చెక్కును అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిఎంఆర్ఎఫ్ నిధులను అందిస్తుందని తెలిపారు. ప్రతీ కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో 
షాబాద్ సహకార సంఘం చైర్మెన్ చల్లా శేఖర్ రెడ్డి, సర్పంచ్ పాండురంగా రెడ్డి, ఉప సర్పంచ్ సందీప్ రెడ్డి, సీనియర్ నాయకుడు శివ్వప్ప, శివరాజ్ గౌడ్, మశ్చేందర్ గౌడ, కార్మిక విభాగం నాయకుడు
రాందేవ్ యాదవ్, మహేందర్,   తదితరులు పాల్గొన్నారు.