డివిజన్ పచ్చదనంతో కళకళలాడాలి

Published: Thursday July 08, 2021
కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్
మేడిపల్లి, జులై7 (ప్రజాపాలన ప్రతినిధి) : డివిజన్లోని అన్ని కాలనీలు పచ్చదనంతో కళకళలాడాలని బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ 22వ డివిజన్ కార్పొరేటర్ దొంతర బోయిన మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా డివిజన్ కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బందితో కలిసి కార్పొరేటర్ మహేశ్వరి కృపసాగర్ ముదిరాజ్ డివిజన్లోని వాడవాడలా మొక్కల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మూడు మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని సూచించారు. స్వచ్ఛమైన గాలి కోసం ప్రతి ఒక్కరూ బాధ్యతతో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ సీనియర్ నాయకులు దొంతరబోయిన కృపసాగర్ ముదిరాజ్, కమిటీ సభ్యులు, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.