విడతలవారీగా గ్రామ అభివృద్ది సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి, సర్పంచ్

Published: Tuesday September 20, 2022

ఇబ్రహీంపట్నం సెప్టెంబర్ తేదీ 19 ప్రజాపాలన ప్రతినిధి

రంగారెడ్డి జిల్లా  మంచాల మండలం పరిధిలోని  ఆరుట్ల గ్రామంలో 1వ వార్డులో మంకు ఇందిర ఇంటి పని మంకు పోచమ్మ ఇంటి వరకు గ్రామ పంచాయతీ నిధుల నుండి 2 లక్షల రూపాయల సీసీ రోడ్డును  గ్రామ సర్పంచ్ కొంగర విష్ణువర్ధన్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామాన్ని ప్రజల సహకారంతో విడతలవారీగా అభివృద్ధి చేస్తామని  అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ పాండాల జంగయ్య గౌడ్, ఎంపీటీసీ సభ్యులు చీరాల రమేష్, పంచాయితి కార్యదర్శి వెంకటేశం, వార్డు సభ్యులు చీమర్ల గాలమ్మ, పంబల శివకుమార్, ఎన్నీదుల స్వప్న సురేష్, కొండురి మల్లేష్,. సేక్ సద్దాం, నూకం మమత మల్లేష్, మాజీ ఎంపీపీ మంకు ఇందిర, మాజీ సర్పంచ్ అనంగాళ్ళ యాదయ్య, ఎండీ. సలాం, గుడ్డిమల్ల చంద్రయ్య, లాలగారీ శ్రీకాంత్, సుంకరి ప్రవీణ్,  వస్పరి కుమార్, చిమర్ల వెంకటేష్, ఊదరి నర్సింహ, పెంటయ్య, భాస్కర్, ఎండీ. షాకేర్, జోగు జంగయ్య, మంకు వినోద్, వెంకటేష్, ఎండీ. జానిపాషా, శ్రీకాంత్* తదితరులు పాల్గొన్నారు.