భీమరెడ్డి గూడెం వాసులకు ప్రమాదంగా చెరువు మత్తడి మూల మలుపు

Published: Monday October 11, 2021
సారంగాపూర్, అక్టోబర్ 10 (ప్రజాపాలన ప్రతినిధి): సారంగాపూర్ మండల్ రేచపల్లి గ్రామం నుండి భీమరెడ్డి గూడెం వెళ్లే గ్రామ వాసులకు చెరువు మత్తడి మూల మలుపు ప్రమాదం అంచున ఉంది. వర్షాకాలం వచ్చిందంటే చాలు ఇదే పరిస్థితి అని గ్రామ వాసులు వాపోతున్నారు. ద్విచక్ర వాహనాలపై వెళ్లేవారు నడిచేవారు ఎందరో మత్తడిలో పడ్డారని కాళ్లకు చేతులకు దెబ్బలు తగిలి గాయాల పాలయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే స్పందించి మత్తడికి బ్రిడ్జిని నిర్మించి తీరాలని ఏదైనా ప్రమాదం సంభవిస్తే అధికారులే దీనికి బాధ్యత వహించాలని గ్రామ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.