గెలుపోటములను సమానంగా తీసుకోవాలి.. తల్లాడ ఎస్సై సురేష్

Published: Friday February 17, 2023
తల్లాడ, ఫిబ్రవరి 16 (ప్రజా పాలన న్యూస్):
 తల్లాడలోని లూర్దుమాత చర్చిలో వాలీబాల్ పోటీల విజేతలకు తల్లాడ ఎస్సై సురేష్ చేతుల మీదగా గురువారం బహుమతులను పంపిణీ చేశారు. లూర్దుమాత పాస్టర్ సురేష్ ఆధ్వర్యంలో ఈ పోటీలు నిర్వహిస్తున్నారు. వారిలో గెలుపొందిన వారికి ప్రధమ, ద్వితీయ, తృతీయ బహుమతులను ఆయన చేతుల మీదుగా అందించారు. అనంతరం ఎస్సై మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకొని ముందుకు సాగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో తల్లాడ మాజీ జడ్పిటిసి మూకర ప్రసాదు, నాయకులు పొట్టేటి బ్రహ్మారెడ్డి, గరిడేపల్లి వెంకటేశ్వరరావు(జి.వి.ఆర్), చార్లెస్, మధు, మోజేష్, రవి, చల్లనాగులు, తదితరులు పాల్గొన్నారు.